జాతీయ వార్తలు

కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: జమ్ము కాశ్మీర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో తమ ప్రభుత్వం వెన్నంటి నడుస్తుందని సోమవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తన ఫాలోవర్ చేసిన ఓ పోస్ట్‌కు స్పందించిన ఆయన ‘‘జమ్ము కాశ్మీర్ ఓ అద్భుతం.. మీరు తప్పనిసరిగా ఆ రాష్ట్రాన్ని చూసి రావాలి.. దాని అందాలను ఆస్వాదించి రావాలి’’ అని ఆయన అన్నారు. దేశంలో అతిపెద్ద సొరంగ మార్గాన్ని ఆదివారం నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని వాజపేయి చేసిన మాటల్ని ప్రస్తావించారు. ‘‘కాశ్మీరియత్, జమూరియత్, ఇన్సానియత్ (కాశ్మీరీయిజం, ప్రజాస్వామ్యం, మానవత్వం)’’ అన్న నినాదంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. కాశ్మీర్ అభివృద్ధిలో ఏ అడ్డంకీ తమను ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.