జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాఖ్‌కు త్వరలో స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 11: ఏడాదిన్నర కాలంలోనే ట్రిపుల్ తలాక్‌కు స్వస్తి పలుకుతామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డు ఉపాధ్యక్షుడు సరుూద్ సాదిక్ ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఉద్ఘాటించారు. దేశ వ్యాప్తంగా షరియా, ట్రిపుల్ తలాక్‌ను అనుకూలిస్తూ మూడున్నర కోట్ల మంది ముస్లిం మహిళలు ఫారాలు పంపారంటూ పర్సనల్ లాబోర్డు ప్రకటించిన రెండు రోజుల్లోనే దాని ఉపాధ్యక్షుడు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ట్రిపుల్ తలాక్‌ను మెజార్టీ మహిళలు ఆమోదిస్తున్నారని చెప్పడానికి తమకు అందిన దరఖాస్తు ఫారాల సంఖ్యే నిదర్శనమని, దీన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య తక్కువేనని బోర్డు మహిళా విభాగం ప్రధాన నిర్వాహకురాలు ఆస్మా జోహ్రా ఇటీవల ప్రకటించిన విషయం గమనార్హం.