జాతీయ వార్తలు

కెవిపి బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా ‘హోదా’ కేంద్రం బాధ్యత కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి.రామచందర్‌రావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ దానిని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన తనను కలిసిన కొందరు విలేకరులతో మాట్లాడుతూ, ప్రైవేట్ మెంబర్ బిల్లులను ఆమలు చేయాలనే నిబంధన లేదన్నారు. విభజన అనంతరం ఏపికి ఐదేళ్లు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తామంటూ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని అమలు చేయాలని రామచందర్‌రావు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదించిన విషయం విదితమే. ఈ బిల్లుపై పలు దఫాలుగా జరిగిన చర్చ శుక్రవారం తుది దశకు చేరింది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి హరీభాయి చౌదరి సమాధానమిస్తూ, విభజన చట్టలో ఇచ్చిన పలు హామీలను ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
పది ఉన్నత స్థాయి సంస్థలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయటంతోపాటు రాష్ట్రానికి దాదాపు తొంబై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశామని ఆయన చెప్పారు. మంత్రి చాలా విస్తృతమైన సమాధానం ఇచ్చినందున రామచందర్‌రావు ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విజ్ఞప్తి చేశారు. ఈ దశలో తెలుగుదేశం సభ్యుడు లేచి సభలో కోరం లేనందున బిల్లుపై చర్చ కొనసాగించటం మంచిది కాదన్నారు. దీంతో రామచందర్‌రావు మాట్లాడుతూ, మొదట సభలో కోరం ఉండేలా చూడాలని, ఆ తర్వాతే తాను మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఐదు నిమిషాల పాటు గంట మోగించినప్పటికీ కోరం లేకపోవడంతో ప్యానల్ చైర్మన్ సభను వాయిదా వేయవలసి వచ్చింది. కోరం లేకపోవటంతో మధ్యలోనే ఆగిపోయిన రామచందర్‌రావు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వచ్చే శుక్రవారం ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి.
తన బిల్లుపై ఓటింగ్ జరపవలసిందేనని రామచందర్‌రావు పట్టుపడుతున్నారు. ఆయన వాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. రామచందర్‌రావు ప్రతిపాదించింది ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి దానితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కొంతమంది నాయకులు వాదిస్తున్నారు. రామచందర్‌రావుది ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి అది రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ దానిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని వెంకయ్య నాయుడు చెబుతున్నారు. అయితే ఏపికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలన్న ఈ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే ఆ తర్వాత ఏమవుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామచందర్‌రావు బిల్లును ప్రభుత్వం అమలు చేయకపోయినా దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశాలున్నాయి.