జాతీయ వార్తలు
బోగీల్లో కరెంటు లేదని ప్రయాణికుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 May 2016
గూడూరుటౌన్,మే 2: అహ్మదాబాద్ నుండి చైనె్న వెళ్లే నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు పరుగుకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్కు సోమవారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకు చేరుకున్న రైలు అందులో తాగునీరు,విద్యుత్ సరఫరా లేదని అగ్రహించిన ప్రయాణికులు గూడూరు స్టేషన్మాస్టర్కు ఫిర్యాదు చేయగా టిఎక్స్అర్ డిపాంట్మెంట్ను పిలిపించి సమస్యను పరిష్కరించారు. ఎస్ 3,ఎస్ 4,ఎస్ 5 బోగిల్లో లైట్లు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో పాటు ఎస్ 7,ఎస్ 10 బోగీల్లో నీరులేదని ప్రయాణికులు అందోళన చేశారు. దాదాపు ఒకటన్నర గంటసేపు రైలు గూడూరు రైల్వే సేష్టన్ అగింది. అనంతరం 5గంటలకు చైనె్న బయలుదేరడంతో రైల్వే అధికారులు ఊపిరిపిలుచుకున్నారు.