జాతీయ వార్తలు

అసెంబ్లీల సీట్ల పెంపు లేనట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టినట్లు తెలిసింది. బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు స్థానిక బి.జె.పి నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాల మూలంగానే ఎన్.డి. ఏ ప్రభుత్వం శాసన సభల సీట్లు పెంచే ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసిందనే మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచేందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం న్యాయ శాఖలో దుమ్ముకొట్టుకుపోతోందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ శాసన సభ సీట్లను 119 నుండి 175, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సీట్లను 175 నుండి 225 సీట్లకు పెంచవలసి ఉన్నది. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం దీనికి ఒక లింక్ పెట్టటం తెలిసిందే. రాజ్యాంగంలోని 10(3) ప్రకారం 2026 వరకు లోక్‌సభ, శాసన సభల సీట్లను పెంచేందుకు వీలు లేదు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచాలంటే మొదట రాజ్యాంగంలోని 170(3)ని సవరించవలసి ఉంటుంది. ఆర్టికల్ 170(3) లేదా ఏ.పి పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లును పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు జరిగే లోగా శాసన సభల సీట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర సమాచార, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కృషి మూలంగా ఈ ప్రక్రియ బాగా ఉపందుకున్నది. అయితే బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చిన తరువాత ఎన్.డి.ఏ ప్రభు త్వం ఆలోచనలో మార్పు వచ్చిందని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభ సీట్ల సంఖ్య పెంచటం వలన తెలంగాణలో టి.ఆర్.ఎస్‌కు ఆంధ్ర ప్రదేశలో తెలుగుదేశం పార్టీలకు రాజకీయం ప్రయోజనం కలుగుతోంది తప్ప తమకు కాదని రెండు రాష్ట్రాల బి.జె.పి నాయకులు మొదటి నుండి వాదించటం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బి.జె.పిని నిలబెట్టేందుకు ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో శాసన సభ సీట్లు పెంచటం రాజకీయంగా మంచిది కాదని బి.జె.పి అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అమిత్ షా ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పని తీరును దుయ్యబట్టటం తెలిసిందే.
అమిత్ షా ఆరోపణలను ఖండించేందుకు స్వయంగా చంద్రశేఖరరావు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తూ టి.ఆర్.ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొంటున్న సమయంలో శాసన సభ సీట్ల సంఖ్యను పెంచటం ద్వారా ఆ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించటం మంచిది కాదని బి.జె.పి అధినాయకత్వం భావిస్తోందని అంటున్నారు.