జాతీయ వార్తలు

ప్రణబ్ చేతుల మీదుగా ‘ఉజ్వల’ కనెక్షన్ పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగీపూర్, జూలై 15: పశ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలను వంట గ్యాస్ కనెక్షన్ అందజేశారు. దేశంలోని ఐదుకోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా ఎల్‌పిజి కనెక్షన్ ఇవ్వాలన్నది ఉజ్వల యోజన లక్ష్యం. కాలుష్యం నివారించి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో గత మే నెలలో కేంద్రం ఉచిత ఎల్‌పిజి కనెక్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రణబ్ స్వగృహం జంగీహౌస్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో వంట గ్యాస్ కనెక్షన్ అందించారు. ఇప్పటికి 2.5 కోట్ల మందికి ఉజ్వల పథకం కింద కనెక్షన్లు ఇచ్చారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్వగ్రామంలో జరిగిన ఎల్‌పిజి కనెక్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని మంత్రి ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్‌లో శనివారం ప్రధాన మంత్రి

చిత్రం.. ఉజ్వల యోజన పథకం కింద ఓ వృద్ధురాలికి గ్యాస్ కనెక్షన్ అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్