జాతీయ వార్తలు
పాక్ కాల్పుల్లో జవాను, మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 13 August 2017
జమ్ము, ఆగస్టు 12: జమ్ము కాశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట పాకిస్తాన్ రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఉదయం గొహ్లాద్ కల్రాన్ గ్రామంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో నలభై ఏళ్ల మహిళ చనిపోయింది. సాయంత్రం 5గంటలకు మరోసారి జరిపిన కాల్పుల్లో నరుూబ్ సుబేదార్ జగ్రమ్ సింగ్ తోమర్(42) మరణించారని ఆర్మీ తెలిపింది.
దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక కెప్టెన్ సహా ఇద్దరు జవాన్లు మృతి చెందగా అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. తప్పించుకున్న మిలిటెంట్ల కోసం ఈ ప్రాంతంలో భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.