జాతీయ వార్తలు

నేషనల్ పోలీసు పోర్టల్ ప్రారంభించిన రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా నేరస్తులు, నేరగాళ్లకు సంబంధించిన వివరాలు ఓ డేటాబేస్‌లో పొందుపరుస్తూ రూపొందించిన డిజిటల్ పోలీసు పోర్టల్‌ను కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ఇక్కడ ప్రారంభించారు. ప్రజలు తమ ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు పోర్టల్‌లో సదుపాయం పొందుపరిచినట్టు హోమ్‌మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల నమోదు, అభ్యర్థన, పరిశీలనలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర పోలీసు విభాగాలు డేటాబేస్, కేంద్ర దర్యాప్తు సంస్థల్లో కేసుల వివరాలు పోర్టల్‌లో లభిస్తాయి. లాగిన్ అవ్వడం ద్వారా అన్ని వివరాలు పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రైమ్, అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్, సిస్టమ్స్ ప్రాజెక్టు(సిసిటిఎన్‌ఎస్) పోర్టల్‌లోకి అన్ని పోలీసుల సేషన్లను అనుసంధానం చేస్తారని అన్నారు.