జాతీయ వార్తలు

టెంపోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఆగస్టు 28: మహారాష్టల్రోని పుణె జిల్లాలో సంభవించిన సోమవారం తెల్లవారుజామున ఘోరప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 12 మంది గాయపడ్డారు. నాసికా త్రయంబకేశ్వర్‌నుంచి పుణె వెళ్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాం సంస్థకు చెందిన బస్సు నారాయణ్ గావ్ సమీపంలో ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని నారాయణ్ గావ్ పోలీసులు చెప్పారు. భారీ వర్షం కారణంగా బస్సు డ్రైవర్ ఆగి ఉన్న టెంపోను చూడకపోవడమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తోందని ఓ పోలీసు అధికారి చెప్పారు. మృత దేహాలను ఇంకా గుర్తించలేదని చెప్పిన ఆ అధికారి గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించినట్లు తెలిపారు.