జాతీయ వార్తలు

వాళ్లకు సిగ్గు లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 14: జాదవ్ పూర్ యూనివర్సిటీ విద్యార్థినులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలిప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘జాదవ్‌పూర్ విద్యార్థినులు స్థాయికి తగినట్లుగా ఉండరు. వారికి బిడియం లేదు. ఎప్పుడూ మగ విద్యార్థులతో కలిసి తిరిగే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు’’ అంటూ అవాకులు పేలారు. గత వారం యూనివర్సిటీలో ఒక సినిమా ప్రదర్శన సందర్భంగా ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన సందర్భంలో ఏబీవీపీ విద్యార్థులు విద్యార్థినులను వేధించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన దిలీప్, అక్కడి విద్యార్థినులే స్థాయికి తగినట్లుగా వ్యవహరించరని అన్నారు. ఏబీవీపీ విద్యార్థులపై ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండించారు. దిలిప్ ఘోష్ వ్యాఖ్యలను జాదవ్‌పూర్ విద్యార్థులు ఖండించారు. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు.