జాతీయ వార్తలు

పళనిస్వామిని తప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 7: రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామిని తొలగించాలని అన్నాడిఎంకె శశికళ వర్గం నేత దినకరన్ డిమాండ్ చేశారు. గురువారం తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావును కలుసుకున్న ఆయన ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కూడా తప్పించాలని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్న దినకరన్ ముఖ్యమంత్రిపై చాలామంది ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని అభిప్రాయపడ్డారు. తనకు మద్దతుగా ఉన్న 19 ఎమ్మెల్యేలపై వత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో పళనికి మెజారిటీ లేదన్న సంగతి తేలిపోయిందని, బలపరీక్ష పెట్టి నిర్ధారించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దినకరన్ తమకు విధేయంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలకు పళనిస్వామి నాయకత్వంపట్ల విశ్వాసం లేదని స్పష్టం చేసిన దృష్ట్యా ఆయనను తొలగించాల్సిందేనని కోరారు.