జాతీయ వార్తలు

యోగి ప్రాబల్యం ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 9: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాబల్యానికి, అధికార బిజెపికి పట్టుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రెండు స్థానాల్లో గోరఖ్‌పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఫూల్‌పూర్ స్థానానికి ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వీరిద్దరూ రాష్ట్ర శాసన పరిషత్‌కు ఎన్నిక కావడంతో రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాల్సి వస్తోంది. ఈ రెండూ తూర్పు యూపీ పరిధిలోని స్థానాలు కాబట్టి వీటి ఫలితాలు అధికార, విపక్షాలకు భవిష్యత్ సంకేతాలే అవుతాయి. అందుకే వీటిలో విజయానికి పోటాపోటీగా ప్రయత్నాలు మొదలెట్టాయి. ముఖ్యంగా గోరఖ్‌పూర్ స్థానంలో బిజెపి విజయం అన్నది ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు అత్యంత ప్రతిష్టాత్మక అంశం. 1998 నుంచి కూడా ఇదే స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. పైగా గోరఖ్‌పూర్ పీఠంతో సంబంధంలేని వ్యక్తిని బిజెపి బరిలోకి దించాల్సి వస్తుంది కాబట్టి అలాంటి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓటర్లు ఎంతమేరకు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 3లక్షల పైచిలుకు మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్ గెలుపొందారు. కులపరమైన లెక్కలను పరిగణలోకి తీసుకుని శివప్రసాద్ శుక్లాకు ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించినట్టు చెబుతున్నారు. 2014లో ఫూల్‌పూర్ నుంచి బిజెపి అభ్యర్థి కేశవ ప్రసాద్ వౌర్య గెలుపొందినందున ఆయన స్థానే ప్రభావశీలగల వ్యక్తినే ఈ ఎన్నికల్లో బిజెపి నిలబెట్టాల్సి వస్తుంది. కాగా ఈ రెండు చోట్లా సమాజ్‌వాదీ పార్టీ 3 లక్షలకు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి కాబట్టి ఈ స్థానంలో మళ్లీ గెలవడం అన్నది బిజెపికి పెద్ద సవాలే. బిఎస్పీ అధినేత్రి మాయావతి వేయబోయే అడుగు ఎలా ఉంటుందన్నదానిపైనా ప్రతిపక్షాల ఐక్యత ఆధారపడి ఉంటుంది.