జాతీయ వార్తలు

రాష్ట్రానికి స్వచ్ఛ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)కు 2017-18 సంవత్సరం రెండో విడతగా రాష్ట్రానికి రూ.299.60 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది. అలాగే ‘స్వదేశీ దర్శని’ పథకంలో భాగంగా బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి రూ.10 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర విడుదల చేసిన నిధులను 10 శాతం ఫెక్సీ నిధులుగా వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని భౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి కేటాయించిన రూ.52 కోట్లలో తాజాగా రూ.10 కోట్ల విడుదల చేసింది. ఈ నిధులు ద్వారా ఆంధ్రలోని బౌద్ధ క్షేత్రాలైన శాలిహుండం, తొట్లకొండ, బావికొండ, బొజ్జనకొండ, అమరావతి, అనుపు తదితర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.