జాతీయ వార్తలు

దినకరన్‌పై మరో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేలం (తమిళనాడు), అక్టోబర్ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామిల ప్రతిష్టను దిగజార్చే అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసినందుకు ఎఐఎడిఎంకె నుంచి బహిష్కృతుడయిన టిటివి దినకరన్‌పై సోమవారం కేసు నమోదు అయింది. మాజీ ఎమ్మెల్యే వెంకటాచలం, ఎఐఎడిఎంకె స్థానిక నాయకుడు శరవనన్‌సహా దినకరన్ అనుచరులు పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వినాయకం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేయడంతోపాటు దినకరన్‌పై కేసు నమోదు చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి పళనిస్వామి సీనియర్ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఒక గోడ పక్కన నిందితులు ప్రధాని, సిఎంలను కించపరిచే రీతిలో ఉన్న కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారని వినాయకం తన ఫిర్యాదులో పేర్కొన్నారు.