జాతీయ వార్తలు
పైరేట్లపై ‘త్రిశూల్’!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 7 October 2017
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత సరుకుల నౌకను కొల్లగొట్టేందుకు పైరెట్లు జరిపిన దాడిని భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ తిప్పికొట్టింది. ఏడెన్ జలసంధిలో భారత సరుకుల నౌక ఎంవి జగ్అమర్పై శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు పైరెట్లు దాడి చేయడానికి ప్రయత్నించారని అయితే ఐఎన్ఎస్ త్రిశూల్ వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిందని నౌకాదళ ప్రతినిధి డికె శర్మ తెలిపారు. భారత్ సరుకుల నౌక జగ్ అమర్ సౌదీ అరేబియాలోని జుబెయిల్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని, పైరెట్ల నౌక నుంచి ఏకె 47, 27 తుటాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
గతంలో ఐఎన్ఎస్ శారద కూడా పైరెట్ల దాడి నుంచి లిబేరియాకు చెందిన ఓ సరుకుల నౌకను కాపాడింది.