జాతీయ వార్తలు

కెకె లైన్‌లో ట్రాక్‌పై బండఠాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతగిరి, అక్టోబర్ 6: కొత్తవలస-కిరండోలు రైలు మార్గంలో శుక్రవారం బండరాళ్లు పడడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనంతగిరి మండలం సిమిలిగుడ- బొర్రా స్టేషన్ల మధ్య 67/18,19 మైలు రాయి వద్ద (గత్తర్) ఉదయం ఒకసారి బండ రాయి పడడంతో రైల్వే అధికారులు దీనిని తొలగించారు. అయితే మధ్యాహ్నం మరోసారి ఇదే ప్రాంతంలో మరో బండరాయి పడడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండోసారి విరిగిపడిన బండరాయిని తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కొంత సమయం పడుతుందని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి కిరండోలు వెళ్లే గూడ్స్ రైళ్లు నిలిచిపోగా శుక్రవారం కిరండోలు నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన పాసింజర్ రైలును అరకులోయ రైల్వే స్టేషన్‌లో నిలిపివేసారు.

చిత్రం..రైలు మార్గంలో పడిన బండరాళ్లను తొలగిస్తున్న దృశ్యం