జాతీయ వార్తలు

తమిళ జాలర్లను వెంటాడిన లంక నేవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామేశ్వరం, నవంబర్ 21: కచ్చతీవు ద్వీపానికి సమీపంలో చేపలవేటకు వెళ్లిన సుమారు 1,700 మంది తమిళ జాలర్లను శ్రీలంక నేవీ సిబ్బంది వెంటాడిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో 75 బోట్లకు చెందిన వలలు ధ్వంసమైనట్లు తమిళనాడు మెకనైజ్డ్ బోట్ల యజమానుల సంఘం ఆరోపించింది. రామేశ్వరం ప్రాంతానికి చెందిన జాలర్లు ఎప్పటిలాగే మంగళవారం ఉదయం చేపలవేటకు సముద్రంపైకి వెళ్లారు. కచ్చతీవు ప్రాంతంలో వీరికి శ్రీలంక నేవీ సిబ్బంది ఎదురై చాలాదూరం వరకూ వెంటాడింది. దీంతో భయభ్రాంతులకు గురైన జాలర్లు వెంటనే వెనుదిరిగారు.