జాతీయ వార్తలు
త్రిపురలో జర్నలిస్టు కాల్చివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 November 2017
అగర్తల, నవంబర్ 21: ఇక్కడి బోధ్జంగ్ నగర్లోని ‘త్రిపుర స్టేట్ రైఫిల్స్’ కార్యాలయంలో వాగ్యుద్ధానికి దిగాడని ఓ పాత్రికేయుడిని తపన్ దెబ్బర్మ అనే బాడీగార్డు కాల్చి చంపాడు. ‘స్యందన్ పత్రిక’కు చెందిన జర్నలిస్టు సుదీప్ దత్తా భౌమిక్ వార్తలను సేకరించేందుకు మంగళవారం ‘త్రిపుర స్టేట్ రైఫిల్స్’లోని సెకండ్ బెటాలియన్ కమాండంట్ కార్యాలయానికి వెళ్లాడు. కమాండంట్ను కలిసేందుకు ప్రయత్నించిన భౌమిక్తో అక్కడి సిబ్బంది ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో తపన్ దెబ్మర్మ అనే బాడీగార్డు అతి సమీపం నుంచి భౌమిక్పై కాల్పులు జరిపాడు. వెంటనే భౌమిక్ను ఇక్కడి జి.బి.పంత్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.