జాతీయ వార్తలు

రాహుల్‌కు పగ్గాలిస్తే బీజేపీకే లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 21: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపడితే తమ పార్టీ పని మరింత సులువవుతుందని బీజీపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అన్న బీజేపీ నినాదం రాహుల్ వల్ల సాకారం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లాంఛనాలు పూర్తి చేసిందన్న వార్తలపై యోగి స్పందిస్తూ, కాంగ్రెస్ పగ్గాలను రాహుల్ చేపట్టడం ద్వారా బీజేపీకి మరింత మేలు జరుగుతుందన్నారు. వారసత్వ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నిదర్శనమన్న సంగతి దేశ ప్రజలందరికీ తెలుసునని, సోనియా తర్వాత రాహుల్ అధ్యక్షుడు కావడం అత్యంత సహజనమని, ఈ మాత్రం దానికి ఇంతటి ఆర్భాటం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. దేశం మొత్తం బీజేపీ పాలనలోకి రావడానికి రాహుల్ కారణమవుతారని యోగి అన్నారు.