జాతీయ వార్తలు

కన్నతండ్రే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచకుల, నవంబర్ 22: అల్లారుముద్దుగా చూసుకోవల్సిన తండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు. సొంత పిల్లలను బావమరిదితో చంపించిన కన్నతండ్రి ఘాతుక చర్య ఇది. హర్యానా కురుక్షేత్రలోని మోర్నీ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. సోనూ మాలిక్ ఓ ఫొటో స్టుడియో నడిపేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు. సమీర్ (11), సిమ్రాన్ (8), సమర్ (4) ఉన్నారు. వివాహేతర సంబంధం ఉన్న సోనూకు ఏం బుద్ధిపుట్టిందో ఏమో చిన్నారులు ముగ్గురినీ హత్య చేయాలని జగ్‌దీప్ మాలిక్‌ను పురమాయించాడు. సోనూకు జగదీప్ వరుసకు బావమరిదే. ఆదివారం ఆడుకుంటామని తల్లికి చెప్పి బయటకు వెళ్లిన పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా ఈ దారుణం వెలుగుచూసింది. సోనూ, జగ్‌దీప్‌లు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సమీర్, సిమ్రాన్, సమర్‌ను కురుక్షేత్రలో జరుగుతున్న గీతా జయంతి ఉత్సవానికి తీసుకెళ్లామని నమ్మించారు. పిల్లలు ముగ్గుర్ని కారులో ఎక్కించుని మోర్నీ అటవీ అడవుల్లోకి తీసుకెళ్లాడు జగ్‌దీప్. కారు నిర్మానుష్యంగా ఉన్నచోట ఆపాడు. తనతో రమ్మని ముందు సమీర్‌ను తీసుకెళ్లి పాయింట్ బ్లాక్ రేంజ్ పిస్టల్‌తో కాల్చి చంపేశాడు. తరువాత సిమ్రాన్‌ను తీసుకెళ్లి కాల్చి చంపాడు. మరో చిన్నారి సమర్‌ను కారులోనే కొంత దూరం తీసుకెళ్లి మట్టుబెట్టాడు. పిల్లల ఆచూకీ తెలియపోవడంతో తల్లి తల్లడిల్లిపోయింది. బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించగా తండ్రి, అతడి బావమరిది చేసి ఘాతుకం వెల్లడైంది. నేరాన్ని తామే చేసినట్టు సోనూ, జగ్‌దీప్ అంగీకరించారు.