జాతీయ వార్తలు
నౌకాదళ ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన లాంబా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 June 2016
న్యూఢిల్లీ, మే 31: భారత నౌకాదళ ప్రధానాధికారిగా అడ్మిరల్ సునీల్ లాంబా (58) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ నౌకాదళ ప్రధానాధికారిగా సేవలు అందించిన అడ్మిరల్ ఆర్కె.్ధవన్ పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన సునీల్ లాంబా పూర్తిగా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. నావిగేషన్, డైరెక్షన్ విభాగాల్లో ఎంతో నిష్ణాతుడైన అడ్మిరల్ సునీల్ లాంబా ప్రపంచంలోని అత్యుత్తమ నావికా దళాల్లో ఒకటైన భారత నౌకదళ సారథిగా బాధ్యతలు చేపట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.
చిత్రం సునీల్ లాంబాకు బాధ్యతలు అప్పగిస్తున్న రాబిన్ కె ధోవన్