జాతీయ వార్తలు

ప్రేమాభిమానానికి కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 26: ‘ఎంతో ప్రేమాభిమానాలు కురిపించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న మానుషి చిల్లార్ అన్నారు. ఇటీవల చైనాలో జరిగిన పోటీల్లో మానుషి మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ పోటీల అనంతరం తొలిసారిగా భారత్‌లోకి అడుగుపెట్టిన ఆమెకు శనివారం ముంబయిలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చినవారికి, అలాగే తన విజయాన్ని కాంక్షించిన వారికి అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న 6వ భారతీయ మహిళ మానుషి. ఇంతకుముందు రీటా ఫారియా (1966), ఐశ్వర్య రాయ్ (1994), దియానా హైడన్ (1997), యుక్తా ముఖి (1999), ప్రియాంక చోప్రా (2000) ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు.

చిత్రం..ముంబయి చేరుకున్న మానుషి చిల్లార్‌కు స్వాగతం చెబుతున్న అభిమానులు