జాతీయ వార్తలు

నిప్పు చుట్టూ చిన్నారి నృత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావణగెరె (కర్ణాటక), నవంబర్ 30: టీవీ సీరియల్‌లో చూసిన ‘ఫైర్ డ్యాన్స్’ను అనుకరిస్తూ నృత్యం చేయడానికి ప్రయత్నించిన ఓ ఏడేళ్ల బాలిక మంటలంటుకొని మృతి చెందింది. ఉత్తర కర్ణాటకలో జరిగిన ఈ విషాద ఉదంతం గురించి బాలిక తల్లిని ఉటంకిస్తూ పోలీసులు గురువారం తెలిపారు. ఈ నెల 11న రెండో తరగతి చదువుతున్న ప్రార్థన అనే బాలిక తన ఇంట్లోని ఒక గదిలో చెత్త కాగితాలను సేకరించి, ఒక చోట పోసింది. తరువాత వాటికి నిప్పు అంటించి వాటి చుట్టూ సీరియల్‌లో చూపినట్టు నృత్యం చేయసాగింది. అయితే అనుకోకుండా ఆమె దుస్తులకు నిప్పు అంటుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు ఆమెను కమ్మేశాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. నందిని అనే సీరియల్‌లో చూపినట్లు తన కుమార్తె నృత్యం చేయడానికి ప్రయత్నించిందని ఆమె తల్లి వెల్లడించారు. ప్రార్థన తన చెల్లిని కూడా నృత్యం చేయడానికి రమ్మని పిలిచింది. కాని, ఆమె నృత్యం చేయడానికి నిరాకరించింది. అయితే అక్కకు మంటలు అంటుకోవడాన్ని చూసిన ఆమె వెంటనే పక్కింటి వారికి ఈ విషయం చెప్పింది. పక్కింటి వారు వెంటనే స్పందించి, ప్రార్థనను ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిపోయిన ప్రార్థన చికిత్స పొందుతూ మరుసటి రోజే మృతి చెందిందని పోలీసులు తెలిపారు.