జాతీయ వార్తలు

ఆంటోనీకి శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: కాంగ్రెస్ నేత, మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోనీకి మెదడుకు సంబంధించిన శస్తచ్రికిత్స చేసేందుకు ఇక్కడి రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు నిర్ణయించారు. మెదడులో రక్తస్రావం కావడంతో ఆంటోనీని బుధవారం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని న్యూరోసర్జన్ల బృందం గురువారం సమావేశమై ఆంటోనీని శస్తచ్రికిత్స చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయనకు సంప్రదాయ విధానంలో వైద్యసహాయం అందిస్తున్నారు. శస్తచ్రికిత్స నివారించేందుకు వైద్యులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అవసరమైన పక్షంలో శస్తచ్రికిత్స చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. 76 ఏళ్ల ఆంటోనీకి అకస్మాత్తుగా మెదడులో రక్తస్రావం కావడంతో ఇంట్లోనే ఒక్కసారి కూలిపోయారు. వెంటనే ఆయనను రామ్‌మనోహర్ ఆస్పత్రిలో చేర్పించారు. కేరళకు చెందిన ఆంటోనీ యుపిఏ హయాంలో రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. రోహింగ్యాల సమస్యపై మోదీ సర్కారు సమర్థవంతంగా పనిచేయడం లేదని ఆయన ఇటీవల విమర్శించారు.