జాతీయ వార్తలు

ఏంచేస్తారో చెప్పరేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెట్‌పూర్ (గుజరాత్), డిసెంబర్ 8: ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, చైనా సమస్యలు ప్రస్తావిస్తున్నారే తప్ప, గుజరాత్‌కు ఏం చేయాలనుకుంటున్నారో ప్రధాని నరేంద్ర మోదీ పెదవి విప్పటం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మరో వందేళ్లు అధికారంలో ఉంటామని చెప్పుకుంటున్న మోదీకి, అందుకే ఏం చేయాలో, ఏం చేయబోతున్నారో చెప్పడం తెలీదా? అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా మలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించిన రాహుల్, ప్రధాని మోదీపై పదునైన విమర్శలతోనే విరుచుకుపడ్డారు.
చోట్టా ఉధేపూర్ జిల్లాలోని గిరిజన ప్రాంతమైన జెట్‌పూర్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ ‘గత 22 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీకి అవకాశం ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు మీ సమస్యలపై దృష్టిపెట్టే పార్టీని గెలిపించుకునే అవకాశం వచ్చింది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి’ అని పిలుపునిచ్చారు.

చిత్రం..గుజరాత్‌లోని జెట్‌పూర్ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ను గజమాలతో సత్కరిస్తున్న స్థానిక కాంగ్రెస్ నేతలు