జాతీయ వార్తలు

సీసీఎంబీ వ్యవస్థాపకులు ప్రసిద్ధ శాస్తవ్రేత్త లాల్జీసింగ్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ప్రఖ్యాత శాస్తవ్రేత్త, సీసీఎంబీ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ లాల్జీసింగ్ ఆదివారం రాత్రి వారణాసిలో కన్నుమూశారు. డిఎన్‌ఎ ప్రింటింగ్‌కు పితగా ఆయనను భావిస్తారు. సిసీఎంబీ డైరెక్టర్‌గా, బెనారస్ హిందూ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా కూడా పనిచేసిన లాల్జీసింగ్ ఆదివారం రాత్రి తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతోవెంటనే ఆయనను అక్కడే ఉన్న సందర్‌లాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీలో జరిగిన నైనా సాహ్ని హత్య కేసుకు శాస్ర్తియ పరిష్కారం ద్వారా లాల్జీసింగ్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. అందరితో కలిసి నవ్వుతూ పనిచేసే లాల్జీసింగ్ జీవశాస్తవ్రిజ్ఞాన రంగంలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు ఎనలేని కృషి చేశారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సీసీఎంబీ, ఎన్‌జిఆర్‌ఐ శాస్తవ్రేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి లాల్జీసింగ్ మృతి వార్తను సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్‌మిశ్రా ట్వీట్ చేయడంతో తెలిసింది.