జాతీయ వార్తలు

మదర్సాపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పాతబస్తీలో ఒక మదర్సాపై దాడి చేసి అందులోని 51 మంది బాలికలకు విముక్తి కలిగించారు. మదర్సాలో చదువు పేరిట విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీసులు లక్నో పాతబస్తీలోని యాసిన్‌గంజ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న జమై ఖదీజ్‌తుల్ కుబ్రా లిలాబ్‌నత్ మదర్సాపై దాడి చేశారు. ఈ సందర్భంగా మదర్సా మేనేజర్ మహమ్మద్ తయ్యబ్ జియాను అదుపులోకి తీసుకుని, 51 మంది బాలికలకు విముక్తి కల్పించారు. అయితే ఈ మదర్సాలో దాదాపు వంద మంది బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ మదర్సాకు రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.