జాతీయ వార్తలు

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంఏ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఏ ఖాన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఎంపికయ్యారు. జాతీయ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మంది సభ్యులుంటే 15 మందిని లోక్‌సభ నుంచి, ఏడుగురిని రాజ్యసభ నుంచి ఎంపిక చేస్తారు. శుక్రవారం జరిగిన సమావేశంలో రాజ్యసభ నుంచి కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్‌తోపాటుగా పశ్చిమ బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎంపీ సుఖేందర్ రాయ్ కూడా ఈ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎంపీ సీతారాం నాయక్‌ను ప్రతిపాదించింది, కాని ఎన్నిక సందర్భంలో ఆయన లేకపోవడంతో ఎంఏ ఖాన్‌ను పిఏసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ఎంపిక చేశారు.