జాతీయ వార్తలు

శవ రాజకీయాలు మానుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: రాహుల్ గాంధీ శవాలపై రాజకీయాలు మానుకోవాలని భాజపా కోరింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇరాక్‌లో 39 మంది భారతీయుల మరణంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తప్పు పట్టారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఇరాక్‌లో హత్యకు గురైన 39 మంది భారతీయుల గురించి ప్రకటించకుంటా, కాంగ్రెస్ గందరగోళం సృష్టించడం ఎంతమేర సబబని ప్రశ్నించారు. ఇక్కడే వారి చిత్తశుద్ధి బయటపడిందన్నారు. అంతేకాదు, భాజపా కేంబ్రిడ్జ్ అనలిటికా సేవలను వినియోగించుకోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీనే వాటిని వినియోగించుకున్నదని ఆరోపించారు. ఇరాక్‌లో హత్యకు గురైనవారి అంశాన్నుంచి మీడియాను పక్కదోవ పట్టించేందుకే ప్రభుత్వం, కాంగ్రెస్ కేంబ్రిడ్జ్ అనలిటికా సేవలను వినియోగించుకున్నదన్న కట్టుకథలను అల్లుతోందంటూ రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ పైవిధంగా స్పందించారు.