జాతీయ వార్తలు

జైట్లీని కలవలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: ఏపీకి ప్యాకేజీ గురించి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని తాను కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని టీటీపీ ఎంపీ సుజనాచౌదరి చెప్పారు. పార్లమెంట్ అవరణలో సుజనాచౌదరి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా తేలేవరకు కేంద్రంతో చర్చలు జరిపే అవకాశం లేదని తేల్చిచెప్పేశారు. ఏ నిర్ణయమైన పార్టీలో చర్చించిన తరువాతనే తీసుకుంటామన్నారు. పార్లమెంట్‌లో జైట్లీ కనిపిస్తే నమస్కారానికి ప్రతినమస్కారం ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ ఎంపీల నిరసన
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విభజన హామీలు నేరవేర్చలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు శక్రవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రతిరోజూ ఏదోఒక రూపంలో నిరసన తెలుపుతున్న ఎంపీ శివప్రసాద్ శుక్రవారం ఎద్దుల బండి నడిపే రైతు వేషంలో పార్లమెంట్ నిరసన తెలపారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు హెచ్చరించారు.