జాతీయ వార్తలు

సంక్షేమం గాలికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని, పాలనను గాలికొదిలేసి కేవలం ప్రచారంకోసం ఆరాటపడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. నరసింహారావు ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, అయితే నీతి ఆయోగ్ సమావేశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువగా 20 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కించుకోవడం పట్ల తాను ఒక ఆంధ్రుడిగా గర్విస్తున్నట్టు పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌లో ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రచారంకోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ కొద్ది నెలలుగా ప్రభుత్వాన్ని ప్రచారంకోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి చొరవ తీసుకోవడం లేదని అన్నారు. ఏపీకి అన్ని విధాలుగా సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికి, కేంద్రం సహాయం చేయడం లేదని చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు ప్రచారం చేసుకున్న మాట వాస్తవం కాదా అని జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీకి హోదా కంటే ప్యాకేజీవల్లే నిధులు బాగా వచ్చాయని అన్నది నిజం కాదా? అని ముఖ్యమంత్రిని జీవీఎల్ ప్రశ్నించారు.