జాతీయ వార్తలు

ఎయిమ్స్‌లో వాజపేయిని పరామర్శించిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్న బీజేపీ అగ్రనేత ఏబీ వాజపేయిని శుక్రవారం మరోసారి పరామర్శించారు. వాజపేయిని ప్రధాని పరామర్శించడం ఇది మూడోసారి. ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వృద్ధుల కోసం నిర్మించతలపెట్టిన జాతీయ కేంద్రం, సూపర్ స్పెషాలిటీ, అత్యవసర విభాగానికి శంకుస్థాపన చేసిన ప్రధాని అక్కడ నుంచి ఎయిమ్స్‌కు వచ్చారు. ఎయిమ్స్‌లోని 300 పడకల పవర్ గ్రిడ్ విశ్రం సదన్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే ఎయిమ్స్, అన్సారీ నగర్, ట్రామా సెంటర్ మధ్య ‘కనెక్షన్ మోటరబుల్ టనె్నల్’ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత వాజపేయిని చూడ్డానకి ప్రధాని వచ్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వాజపేయి వద్ద పది, పదిహేను నిముషాలు ఉన్నారు. వాజపేయికు ఆయనకు ఒకే కిడ్నీ పనిచేస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోయారు.