జాతీయ వార్తలు

హామీలన్నీ అమలు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఏపీ శాఖ మంగళవారం పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆందోళన నిర్వహించింది. ఏపీకి న్యాయం చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ ఏపీ అధ్యక్షుడు భగత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విభజన హామీలు ఆమలు చేయకుండా నాలుగేళ్లుగా తాత్సారం చేశాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇచ్చే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం పాల్గొన్నారు. కేవీపీ మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో మొదటి నుంచీ పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. ఆంధ్ర భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు.