జాతీయ వార్తలు

బైసన్ పోలో గ్రౌండ్ కోసం నిరసన తెలపడం దిగజారుడు రాజకీయాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభలో బైసన్‌పోలో గ్రౌండ్ కోసం నిరసన తెలపడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గురువారం ఆయన విలేఖరుతో మాట్లాడుతూ అవినీతిని కప్పిపుచ్చుకోనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుబీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పేరుచెప్పి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు ఎన్నో హామీలు అమలు కావాల్సి ఉండగా కేవలం బైసన్‌పోలోగ్రౌండ్ కోసమే లోక్‌సభలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నూతన సచివాలయం పేరుతో సొమ్ములు దండుకోడానికి ఈ కొత్త నాటకం మొదలెట్టారని పొన్నాల అన్నారు.