జాతీయ వార్తలు

దళితులను పట్టించుకోని కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: కాంగ్రెస్ పార్టీ దళితులకు ప్రయోజనం కల్పించే ఏ పని చేయలేదని, దళితుల సంక్షేమం పట్టించుకోలేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దళితుల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించే స్థాయి, అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. ఇటువంటి విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. ఈ అంశంపై ఆయన ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి పదును పెట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిషన్‌ను రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించామన్నారు. దళితులను, ఓబీసీలను అవమానించడం తప్ప మరొక పని కాంగ్రెస్‌కు లేదన్నారు. జంతర్‌మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్రమోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ట్వీట్‌లో అమిత్‌షా బదులిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ చట్టాలను కఠినం చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీల అన్యాయం జరుగుతుందనే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని పటిష్టంచేశామని, రాజ్యాంగ సవరణలు తెచ్చామన్నారు. దళితుల రక్షణకు మరిన్ని అంశాలను పొందుపరిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్ధాల తరబడి దేశాన్ని పాలించిందని, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రాం, సీతారాం కేసరి లాంటి మహనీయులకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని, వారిని అవమానపరిచిందన్నారు. ఉద్యోగాల్లో పదోన్నతుల అంశానికి కాంగ్రెస్ పార్టీ గతంలో మద్దతు ఇవ్వలేదన్నారు. అంబేద్కర్ జీవితంలో ప్రధాన ఘట్టాలు చోటు చేసుకున్న ఐదు ప్రదేశాలను కలిపి పంచతీర్థ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. కాగా అంతకుముం దు రాహుల్ జంతర్‌మంత ర్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడు తూ బీజేపీ పా లిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, దళితులం టే సవతి ప్రే మను ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం దళిత వ్య తిరేక ప్రభుత్వమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధు లు కేటాయిస్తామని రాహుల్ చెప్పారు.