జాతీయ వార్తలు

అవి జాతి వివక్ష దాడులు కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఆఫ్రికన్లపై ఇటీవల జరిగిన దాడులు జాతి వివక్షతో కానీ, ముందస్తు కుట్రతో కానీ చేసినవి కావని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ ఇవి సంఘ వ్యతిరేక శక్తులు చేసిన నేరపూరిత దాడులని అన్నారు. ఆఫ్రికన్లపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సభ్యులకు వివరించారు. ఆఫ్రికన్ విద్యార్థుల కోసం భారత్‌లో ఉపకార వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అదేవిధంగా వారికోసం క్యాంపస్ హాస్టళ్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు. ఇలాంటి దాడులు మున్ముందు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం విదేశాంగశాఖ సహాయ మంత్రి వికె సింగ్, తమ శాఖ కార్యదర్శితో కలిసి ఆఫ్రికన్ ప్రతినిధులతో భేటీ అవుతారని ఆమె తెలిపారు. ఢిల్లీలో కాంగో జాతీయుడి హత్య అనంతరం ఆ దేశ రాజధాని కిన్షాసాలో భారతీయులపై దాడులు జరిగాయని సుష్మా రాజ్యసభకు తెలిపారు.