జాతీయ వార్తలు

రాజ్‌నాథ్‌తో నరసింహన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించినట్లు తెలిసింది. నరసింహన్ ఈ మేరకు ఒక నివేదికను రాజ్‌నాథ్‌కు అందజేశారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరసింహన్ హోం శాఖ మంత్రిని కలిసి నివేదిక ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి వస్తుందా లేదా? అనే అంశం గురించి గవర్నర్ నివేదికలో వివరించారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితి, శాంతిభద్రతల వ్యవహారం, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పాదయాత్ర, వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దాని ప్రభావం? నరసింహన్ తమ నివేదికలో ప్రస్తావించారని అంటున్నారు.