జాతీయ వార్తలు

ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ తదితర ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ ముగియటంతో కేంద్ర ఎన్నికల సంఘం తన దృష్టిని 2019 ఏప్రిల్, మేలో జరపవలసిన లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక చర్చలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసాతో ఈ అంశంపై ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. 17వ లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్, మేలో ఎనిమిది నుండి పది దశల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించిందని అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్‌ను పార్లమెంటులో ప్రతిపాదించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం 17వ లోక్‌సభ ఎన్నికలకు సంబందించిన షెడ్యూలును సిద్ధం చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు జనవరి 8వ తేదీతో ముగుస్తాయి. 16వ లోక్‌సభ ఆఖరు సమావేశాలు జనవరి ఆఖరు వారంలో ప్రారంభమై ఫిబ్రవరి 10 లేదా 12వ తేదీలోగా ముగుస్తాయని అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియను ముగించిన తరువాత ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి త్వరలోనే వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ఒక విస్తృత స్థాయి సమావేశం జరుపుతారని తెలిసింది. 2014లో పదహారవ లోక్‌సభ ఎన్నికలు 2014 ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు తొమ్మిది దశల్లో జరిగాయి. భద్రతా కారణాల దృష్టా 17వ లోక్‌సభ ఎన్నికలు ఎనిమిది నుండి పది దశల్లో జరుగవచ్చునని అంటున్నారు. నరేంద్ర మోదీ 2014 మే పదహారో తేదీనాడు దేశ పధ్నాల్గవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా లోక్‌సభ మొదటి సమావేశం జూన్ 4 నుంచి 11 వరకు జరిగింది.
ఫిబ్రవరి రెండో వారంలో పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఎన్నికల రంగంలోకి దూకేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. 17వ లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జమ్ముకాశ్మీర్ శాసనసభలకు ఎన్నికలు జరుగవలసి ఉన్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు కూడా లోక్‌సభ ఎన్నికలతో జరుగవలసి ఉండగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన విషయం తెలిసిందే.