జాతీయ వార్తలు

ఆగని టీడీపీ ఎంపీల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నదని ఆరోపిస్తూ, తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్‌లో శుక్రవారం కూడా తమ నిరసనను కొనసాగించారు. ఉదయం పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు తోట నర్సిహం, అవంతి శ్రీనివాస్, శ్రీరాం మాల్యాద్రి, టీజీ వెంకటేశ్, కనకమేడల రవింద్రకుమార్ పాల్గొన్నారు.