జాతీయ వార్తలు

త్వరలో వైజాగ్-యశ్వంతపుర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: విశాఖపట్నం- యశ్వంతపుర వీక్లీ స్పెషల్ రైలు సర్వీసు త్వ రలోనే అందుబాటులోకి రానుంది. జనవరి నుంచి ఏప్రిల్ 2019 వరకూ ఈ సర్వీసును పునఃప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ వారంతపు రైలుకు విపరీతమైన రద్దీ ఉన్న విషయం వాస్తవమేనా? అలాంటప్పుడు నిలిపివేయడానికి కారణాలేమిటి? అంటూ శుక్రవారం రాజ్యసభలో వైసీపీ స భ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యం కోసమే ప్రత్యేక రైళ్లు నడపడం రైల్వే విధానమని చెప్పారు.
నిలిపివేసిన విశాఖపట్నం-యశ్వంతపుర స్పెషల్ ట్రైన్‌ను తిరిగి జనవరి నుంచి ఏప్రిల్ వరకు పునరుద్ధరించాలని కూడా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.