జాతీయ వార్తలు

కిటకిటలాడిన శబరిమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల, డిసెంబర్ 22: కేరళలో ప్రసిద్ధ శబరిమల అయప్పస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకటిలాడింది. మండల వార్షిక పూజల నేపథ్యంలో ఒక్కరోజే లక్ష మంది యాత్రికులు తరలితరలి వచ్చారు. గత కొంతకాలంగా నిరసనలో హోరెత్తిపోయిన శబరిమల పరిసరాల్లో ఉత్సహపూరిత వాతావరణం కనిపించింది. శుక్రవారం ఒక్కరోజే 1.12,260 మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈఏడాది వార్షిక పూజలు ప్రారంభమైన తరువాత ఇంత ఎక్కువ మంది భక్తులు తరలిరావడం ఇదే మొదటిసారని వారన్నారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.