జాతీయ వార్తలు

విచ్ఛిన్నకర శక్తులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 22: సమాజాన్ని కులాలు, మతాల పేరుతో విభజించి రాజకీయంగా లబ్ధిపొందాలనే శక్తులపై భద్రతా ఏజన్సీలు అప్రమత్తంగా ఉండాలని, దేశానికి ఈ శక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశాన్ని తీవ్రవాదంతో విచ్ఛిన్నం చేయాలనే చీకటి శక్తులు, సంస్థలపై నిఘా పెట్టాలని ఆయన పోలీసులను కోరారు. దేశమంతా ఒక్కటే అనే సమభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పోలీసులను కోరారు. గుజరాత్‌లోని కవాడియాలో జరిగిన డీజీపీ, ఐజీల వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ వివరాలను పోలీసు శాఖ ప్రకటనలో విడుదల చేసింది. దేశ సమగ్రత, ఐక్యత కోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన కోరారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా పని చేయాలనే సంకల్పంతో పోలీసుశాఖ పనిచేయాలని, ఈ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు అన్ని రకాల దుష్టపన్నాగాలతో ఉండే శక్తులను ఒక కంట కనిపెట్టి ఉండాలన్నారు. ఈ శక్తులను గుర్తించి ఏకాకులను చేయాలన్నారు. ఉగ్రవాదం నడ్డివిరిచేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. జమ్ముకాశ్మీర్‌లోని పోలీసులు దేశ భద్రతకు ఎనలేని త్యాగాలు చేస్తున్నారన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారన్నారు. పోలీసులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం, భద్రత లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసుల త్యాగాలను గుర్తించాలని ఆయన సీనియర్ పోలీసు అధికారులను కోరారు. ఒక్కోసారి పోలీసులకు వారు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించదని, ఆ లోటు రానివ్వకుండా చూడాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా దేశ విచ్ఛిన్నకరశక్తులపై నిఘా పెట్టాలన్నారు. సైబర్ సెక్యూరిటీ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ అంశాలపై పోలీసులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన విశిష్టసేవలు అందించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్టప్రతి పతకాలను అందచేశారు. జాతీయ పోలీసు స్మారకోత్సవ సందర్భంగా పోలీసుల సేవలను గుర్తిస్తూ ఒక తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు. పోలీసు స్మారక స్థూపం ప్రజలకు స్ఫూర్తినిస్తోందన్నారు. సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.