జాతీయ వార్తలు

15 నిమిషాల్లో చార్జింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: ఒకవైపు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు పెనుభారంగా మారుతుండగా, వాటికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే అడుగిడుతున్న బ్యాటరీ వాహనాలకు చార్జింగ్ పెద్ద సమస్యగా పరిణమించింది. వాటి చార్జింగ్‌కు గంటలు గంటల సమయం పడుతుండటంతో వినియోగదారులు వాటిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఆ సమస్యకు తాము పరిష్కారం కనుగొన్నామని చెబుతున్నారు ముంబయికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వారు. వీరు తాము అభివృద్ధి చేసిన నూతన బ్యాటరీని కేవలం 15 నిముషాల లోపే చార్జింగ్ చేయవచ్చునని ప్రకటించారు. ప్రస్తుతం వాడుతున్న లిథియమ్-ఐయాన్ బేటరీ స్థానంలో వీటిని అభివృద్ధి చేసినట్టు ముంబయికి చెందిన అంకుర సంస్థ జిగాడిన్ ఎనర్జీ సహవ్యవస్థాపకుడు జుబిన్ వర్గేస్ వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) ధరలో 40 శాతం బ్యాటరీ ధరే ఉంటోందని, ఇది వినియోగదారులకు పెనుభారమని చెప్పారు. అయితే 2030 నాటికి బ్యాటరీల ధర, వాటి చార్జింగ్‌కు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించగలిగితే బ్యాటరీ వాహనాలు అందరికీ అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న లిథియమ్-ఐయాన్ బ్యాటరీల చార్జింగ్‌కు అధిక సమయం పడుతోందని తెలిపారు. అయితే ఇప్పుడు వస్తున్న ఆధునిక టెక్నాలజీతో త్వరగా చార్జింగ్‌ను చేయవచ్చునని, సూపర్ కెపాసిటర్లతో పాటు క్విక్ ఎనర్జీ డెన్సిటీ కనె్వన్షనల్ బేటరీలతో చార్జింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని, తాము తయారు చేసిన ఆధునిక బేటరీ కేవలం 15 నిముషాల లోపే చార్జింగ్ అవుతుందని ఆయన చెప్పారు. 2020 కల్లా వాణిజ్య మార్కెట్లోకి తమ బ్యాటరీలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాము ఎలక్ట్రోస్టాటిక్, ఎలక్రో కెమికల్‌విధానం అవలంబిస్తున్నామని, దీని ద్వారా బ్యాటరీ చార్జింగ్ 50 రెట్లు వేగంగా జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దీని ధర లిథియం బ్యాటరీ అంతే ఉంటుందని భావిస్తున్న భవిష్యత్‌లో బాగా తగ్గుతుందని ఆయన చెప్పారు. అలాగే ఈ బ్యాటరీలను కేవలం వాహనాలకే కాక టెలికాం టవర్స్, వినియోగదారుల వస్తువులు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో ఉపయోగింవచ్చునని ఆయన చెప్పారు.