జాతీయ వార్తలు

నాపై ఓ వర్గం కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఒక వర్గం మీడియా తనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, తాను చేసిన ప్రకటనలను వక్రీకరిస్తూ, నాపై కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘గెలిచినప్పుడు బాగానే ఉంటుంది.. ఓడిపోయినప్పుడు కూడా ఆ నాయకత్వం బాధ్యత తీసుకోవాలి’ అంటూ పూణెలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ అధిష్ఠానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని కొంతమంది విశే్లషించడం తెలిసిందే. దీనిపై స్పందించిన గడ్కరీ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తనకు, పార్టీకి మధ్య వైరుధ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ అధికారానికి దూరమైన విషయం తెలిసిందే.