జాతీయ వార్తలు

మీ దేశంలో మైనార్టీలకు భద్రత ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పాకిస్తాన్ మైనార్టీల పట్ల ఆకృత్యాలకు, దారుణాలకు పాల్పడిన దేశమని, కొన్ని లక్షల మందిని హతమార్చిన చరిత్ర పాక్‌కు ఉందని బీజేపీ ధ్వజమెత్తింది. భారత్‌లో మైనార్టీలకు భద్రత లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శించింది. పాకిస్తాన్ మైనార్టీలపై జరిగిన దాడుల మధ్య 1947లో ఆవిర్భవించిందన్నారు. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్ల యాత్ర చేసినట్లుగా ఇమ్రాన్ ఖాన్ కామెంట్లు ఉన్నాయన్నారు. 1947లో పాకిస్తాన్ ఆవిర్భవించిన తర్వాత ఆ దేశంలో మైనార్టీలైన హిందువులు, సిక్కులను దేశం నుంచి తరిమిగొట్టారని, పెద్ద సంఖ్యలో ప్రజలను హతమార్చారని చెప్పారు. తమ మాట వినని వారిని మతమార్పిడులు చేయించారన్నారు. అదే భారత్‌లో మైనార్టీలు సురక్షితంగా ఉన్నారని, అభివృద్ధిలో భాగస్వాములయ్యారన్నారు. పాక్‌లో మైనార్టీలు రెండుశాతం ఉన్నారన్నారు. పాక్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిని హిందీ నటులు యూసుఫ్ ఖాన్ అలియాస్ దిలీప్ కుమార్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖాన్ ప్రజల హృదయాలను దోచుకున్నారన్నారు. ఇక్కడ భారతీయులు ఈ నటులను ఆరాధించారన్నారు. పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక ఆర్టిస్టు పేరును ఇమ్రాన్ ఖాన్ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.