జాతీయ వార్తలు

అభివృద్ధి పూజ్యం.. గణాంకాలు ఘనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 23: తప్పుడు గణాంకాలతో తన ప్రభుత్వ విజయాలను ఏకరవు పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆర్థిక స్థితిగతుల వాస్తవాలు ఒకలా వుంటే, మోదీ గణాంకాలు తిమ్మిని బమ్మిని చేసే రీతిలో వున్నాయని ఆయన అన్నారు. 99శాతం వస్తుసేవలు, 18శాతం జీఎస్టీ పరిధిలోకి తెస్తామని అంతకంటే దిగువకు పన్నును తగ్గిస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ప్రస్తావించిన ఏచూరి ‘ఇప్పటికే 97శాతం వస్తు సేవలు, 18శాతం జీఎస్టీ పన్ను పరిధిలో వున్నాయి’ అని అన్నారు. ఈ విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానం గోబెల్స్‌ని మరిపించేలా వుందని వ్యాఖ్యానించారు. జర్మనీని నాజీలు పాలిస్తున్న కాలంలో హిట్లర్ ప్రచార మంత్రిగా వున్న గోబెల్స్ ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని చేసేవారని ఏచూరి అన్నారు. వాస్తవాలను వక్రీకరించే రీతిలో అదే తరహాలో మోదీ కూడా గణాంకాలతో విన్యాసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్ల్‌మార్క్స్ 200వ జయంతి సందర్భంగా ఆదివారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఏచూరి మాట్లాడారు. ప్రధాని మోదీ అలాగే బీజేపీలు తమ ప్రయోజనాలకు అనుకూలంగా అభివృద్ధి లెక్కలను తారుమారు చేస్తున్నారని ఆ కోణంలోనే తమ ఘనతను చాటుకుంటున్నారని ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఇందులో భాగంగానే సమాజంలో చీలికలు తెస్తున్నారని ఏచూరి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వాస్తవాలే ఎన్‌డీఏ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.

చిత్రం..కార్ల్‌మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి