జాతీయ వార్తలు

తప్పుడు వివరాలిచ్చినా అనర్హతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: శాసనమండలి ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇస్తూ డిక్లరేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికైన తర్వాత అనర్హత వేటు వేసే విధంగా చట్టానికి సవరణలు తేవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు విధించాలని ఈసీ పేర్కొంది. ఎన్నికల సమయంలో అవినీతికి పాల్పడే వారిపై కాగ్నిజబుల్ నేరం కింద కేసులు నమోదు చేయాలని ఈసీ యోచిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జనవరి 8వ తేదీతో ముగుస్తాయి. ప్రధాన ఎన్నికల కమిషన్ తరహాలోనే ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు రాజ్యాంగ బద్ధమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని రూపొందించాలని ఈసీ కేంద్రాన్ని కోరింది. ప్రధాన ఎన్నికల కమిషన్‌ను పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంటు అభిశంసన తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషనర్లను తొలగించే అధికారం రాష్టప్రతులకు ఉంటుంది.