జాతీయ వార్తలు

సహనానికి ప్రతీక భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 23: సహనానికి భారత్ పెట్టింది పేరని, మన దేశంలో ఉన్నంతమంది సహనశీలురు ప్రపంచంలో ఎక్కడా లేరని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ- భారతదేశంలో ఉన్నంత సహనం మరే దేశంలోనూ లేదని, ఒకవేళ భారతీయుల్లో సహనం నశిస్తే.. ఇక ప్రపంచంలో ఏ మూలవెతికినా అది కనిపించదని అన్నారు. భిన్న మతాలు, సంప్రదాయాలకు చెందిన జనులంతా శాంతియుతంగా మెలగుతూ దేశాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల బులందర్‌షహర్‌లో ఒక పోలీసును దారుణంగా చంపిన విషయంపై ప్రముఖ సినీనటుడు నజీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విలేఖరులు ప్రస్తావించగా, ‘ఈ విషయమై ఇప్పటికే పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేశానని, ఇక బయట చెప్పేదేమీ ఉండదని’ అన్నారు.

చిత్రం..లక్నోలో ఆదివారం జరిగిన కేజీఎమ్‌ఏ 114వ సంస్థాపక దినోత్సవ కార్యక్రమంలో
ఓ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్