జాతీయ వార్తలు

పుండుమీద కారం చల్లడమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానం 1984 అల్లర్లలో ఊచకోతకుగురైన సిక్కుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భారతరత్న పురస్కారాన్ని తొలగించాలని తీర్మానం చేసిన అసెంబ్లీ ఆ తర్వాత ఈ తీర్మానంతో సంబంధం లేదని పేర్కొనడం విడ్డూరమన్నారు. అసలు తీర్మానంలో గాంధీకి భారతరత్నను తొలగించాలనే అంశం లేని, ఇది సవరణ మాత్రమేనని ఉపముఖ్యమంత్రి శివోడియా అన్నారన్నారు. ముందుగా తీర్మానం ఆమోదించడం, ఆ తర్వాత ఆ తీర్మానం ఆమోదించలేదనడం పరస్పర విరుద్ధమైన కథనాలను ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొన్నదన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు 1984 అల్లర్లకు గురైన బాధితుల కుటుంబాలను బాధించాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వంద్వ ధోరణులకు ఈ తీర్మానం నిదర్శనమన్నారు. దశాబ్ధాలు గడచినా, సిక్కు బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దోషులను శిక్షించేందుకు కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌పై సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణల్లో పసలేదన్నారు. దేశంలో చొరబాటుదారులను గుర్తించి పంపించివేస్తామన్నారు. కాని వీరిని రాహుల్ గాంధీని వెనకేసుకునిరావడంపై ఆయన కాంగ్రెస్‌నునిలదీశారు. అసోంలో జాతీయ పౌరరిజిస్టర్ విషయంలో కాంగ్రెస్ హడావుడి చేసి ఈ రోజు వౌనంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందన్నారు. తాను సీదాసాదా నేతనని చెప్పుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు పోలీసు బందోబస్తు లేకుండా ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నారన్నారు.