జాతీయ వార్తలు

శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంబా, డిసెంబర్ 23: శబరిమలలో అయ్యప్పస్వామిని మహిళలు దర్శనం చేసుకునే విషయంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 11 మంది మహిళల బృందం ఆదివారం స్వామిని దర్శించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని స్థానిక భక్తులు, నిరసనకారులు అడ్డుకుని తరిమికొట్టడతో వారు దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. చెన్నైకు చెందిన ‘మణితి’కి చెందిన 11 మంది మహిళల బృందం ఆదివారం పోలీసుల సహాయంతో అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు అడవుల నుంచి ఉన్న పాదమార్గం ద్వారా గుడి సమీపానికి చేరుకున్నారు. అయితే వందలాది మంది భక్తులు వారిని తరిమికొట్టారు. వారిని చూసిన పోలీసులు, మహిళలు పరుగుతీసి దగ్గరలోని గార్డు రూములో తలదాచుకున్నారు. అటవీ మార్గాన్ని వందలాది మంది భక్తులు మూసివేసి మహిళా భక్తులు గుడిలోకి చేరకుండా అడ్డుకున్నారు. మహిళలను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని, దారికి అడ్డు తగలాలని పోలీసులు చేసిన హెచ్చరికలు చేసి కొంతమందిని అరెస్టు చేసినా భక్తులు లెక్కచేయలేదు. ఈ సందర్భంగా మణితి సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
తొలుత ఆదివారం ఉదయం 3.30 గంటలకే 11 మహిళల బృందం ఇడు క్కి-కంభమేడు మార్గానికి చేరుకున్నారు. ఈ బృదంలో ఆరుగురు మహిళలు సంప్రదాయ ఇరుముడిని సైతం ధరించారు. అయితే అటవీ మార్గం కూడా వీరు వెళ్లకుండా భక్తులు అయ్యప్ప నామజపం చేస్తూ అడ్డుకోవడంతో ఆరు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కాగా కేరళకు చెందిన దళిత ఉద్యమనేత అమ్మినీ ఆదివారం తాను నడకమార్గం ద్వారా అయ్యప్పను దర్శించుకుంటానని ప్రకటన చేసినా, భక్తుల నిరసనలతో వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుముందు 11 మంది మహిళా బృందాన్ని పోలీసులు అయ్యప్ప స్వామి వద్దకు తీసుకువెళ్లడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇలావుండగా తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు, ఇతరులు అయ్యప్ప నామ జపం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ శ్రీ్ధరన్ పిళ్లై మాట్లాడుతూ పవిత్రమైన అయ్యప్పస్వామి దేవాలయాన్ని యుద్ధ ప్రదేశంగా మార్చడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ట్రెక్కింగ్ ద్వారా భక్తులను కొండపైకి చేర్చిన సంఘటనలు ఇప్పటిదాకా ఎప్పుడూ చోటుచేసుకోలేదని, దీనిపై నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాము సోమవారం రాష్టవ్య్రాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల మాట్లాడుతూ పినరయి ప్రభుత్వం ఆలయ పవిత్రతను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కొంతమంది మహిళా నేతలను పోలీసుల సహాయంతో అయ్యప్పదర్శనానికి తీసుకురావడాన్ని దేవస్థానానికి చెం దిన పండలం కుటుంబం ఖండించింది. దీనిపై రాష్ట్ర మంత్రి ఈపీ జయరాజన్ విలేఖరులతో మాట్లాడుతూ ‘దర్శనానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించడం మా బాధ్యత, శబరిమలలో మేము శాంతిని కోరుకంటున్నాం’ అని తెలిపారు.
ఇలావుండగా 41 రోజుల పాటు చేపట్టే మొదటి విడత మండల పూజ ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఇలావుండగా అన్ని వయసుల మహిళలు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చునని సెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పలువురు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను కొందరు భక్తులు అడ్డుకుంటుండటంతో ఇంతవరకు నెరవేరలేదు.
చిత్రం..అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన
11మంది మహిళలను దారిలోనే నిలిపి వేసిన భక్తులు